తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలపై కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. ఆడ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారంటూ.. వారికి బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, సీఎంఓకు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లకు ట్వీట్టర్ లో ట్వీట్ చేస్తూ రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.
— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022
తాజాగా రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్ళి చదువుకొంటున్నారు. విద్యా సంస్థలు విడిచి పెట్టాక బస్సులు లేక చాలా దూరం చీకటిలో నడిచి వెళ్లాల్సి వస్తోంది అన్నారు.
అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో చదువుకొనే పిల్లలు భయపడుతున్నారన్నారని ట్వీట్ లో పేర్కొన్నారు పవన్. ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నా సక్రమంగా నడపకపోవడం, తరచూ ఆ సర్వీసు రద్దు చేస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ చీకటిలో నడిచి వెళ్తున్నారన్నారు. ఈ పరిస్థితిని మీడియా కూడా వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు.
విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి..
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు ..
Sri @SajjanarVC @KTRoffice @TelanganaCMO @tsrtcmdoffice pic.twitter.com/ZRrnXTpLeg— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈ సమస్యపై స్పందించి స్టూడెంట్స్ కోసం బస్సు నడపాలని పవన్ కోరారు. బస్సు సదుపాయం లేదనో.. అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడో విద్యార్ధినులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, తెలంగాణ సీఎంఓకు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లకు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.