జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్లోనే పీక్ స్టేజిలో ఉంది. టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలన్న జాన్వీ కలలు ఈ మధ్యే నిజమయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘NTR30’తో జాన్వీ.. తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల తెలిపారు.
పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అవ్వడంతో ఈ సినిమా టీమ్ షూట్కు వెళ్లనుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వర్క్ పూర్తి అయ్యింది. షూటింగ్ను ఏకధాటిగా నిర్వహించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ నటిస్తోంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఓ లుక్ను కూడా టీమ్ ఇటీవల విడుదల చేసింది టీమ్.
ఇక తాజాగా జాన్వీ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేసింది. ఇప్పటికే దర్శకడు కొరటాల శివకి పలుమార్లు మెసేజ్ చేసానని, రెఫరెన్స్లు ప్రిపరేటరీ షూట్స్ కోసం ఆయనని అడుగుతున్నానని అన్నారు. మూవీ షూట్ కోసం తాను రోజులు లెక్కిస్తున్నానని, ఎన్టీఆర్తో కలిసి పనిచేయాలని ప్రతిరోజు ప్రార్థించానని తెలిపారు.
అలా ఉంటే జాన్వీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాన్వీ మామూలుగా ఒక్కో హిందీ సినిమాకు 3.5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం ఆమె 5 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. దీంతో ఇంత తేడా ఎందుకని.. ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అక్కడ అలా.. తెలుగులో మాత్రం నటిస్తే.. ఇంత మొత్తం ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటూ.. ఇది ఒకరకంగా పక్షపాతం చూపించడమే అని కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ 30జాన్వీ ఫస్ట్ సౌత్ సినిమా. అయితే ఈ సినిమా కోసం జాన్వీ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. దీనికి కారణం లేకపోలేదు. ఇది ఆమె ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. దీనికి తోడు ఆర్ ఆర్ ఆర్ లాంటీ సినిమాతో గ్లోబల్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్తో నటించడం.. అంతేకాదు కొరటాల శివ లాంటీ డైనమిక్ దర్శకుడితో పనిచేయడం ఇలా.. ఆమెకు అన్ని ఆసక్తిని కలిగించేవి. దీంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభంకావాల్సి ఉంది. అయితే తారకరత్న మరణించడంతో.. ఈ కార్యక్రామాన్ని వాయిదా వేశారు.. ఇక ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 24 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివారులో వేసిన సెట్లో మొదలు అయ్యింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్గా ఖరారు అవ్వడంతో.. ఆమె మిగతా ప్రోజెక్టుల కంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసమే డేట్స్ కూడా ఎక్కువ కేటాయించింది అని సమాచారం. 2024, ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. యువసుధ ఆర్ట్స్తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక తాజాగా బికినీలో అందాల విందు చేస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది. ఇవి నెట్టింట్లో ప్రస్తుతం రచ్చ చేస్తున్నాయి. అయితే ఇలాంటి హాట్ ఫోటోల గురించి జాన్వీ మాట్లాడుతూ రేంజ్లో అందాలు ఆరబోయడం వెనుక కారణం ఉందని.. తాను సోషల్ మీడియాను అంత సీరియస్గా తీసుకోలేదని.. అయితే అక్కడ కాస్తా బోల్డ్గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని.. ఇంకో 5 మంది తన ఫోటోలను లైక్ చేస్తారని, దీంతో తనకు ఉన్న ఈఎంఐలు కట్టడం కాస్తా సులువు అవుతుందని.. అందుకే అలా చేసున్నానని తెలిపింది జాన్వీ.
ఇక అది అలా ఉంటే జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీకపూర్ నిర్మాత. ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో..