• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » విద్యార్థుల‌కు మధ్య ఘర్షణ.. వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ

విద్యార్థుల‌కు మధ్య ఘర్షణ.. వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ

Last Updated: April 12, 2022 at 9:02 am

ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణపై రిజిస్ట్రార్‌ ఓ లేఖ విడుదల చేశారు. విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ నోటీసులో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో శాంతికి భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పార‌ని ఆ లేఖ‌లో రిజిస్ట్రార్ తెలిపారు.

శ్రీరామ‌న‌వ‌మి పూజ‌ సందర్బంగా ఆదివారం వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ తలెత్తింది. యూనివర్సిటీ మెస్‌లో మంసాహారం వడ్డించటంతో ఈ ఘర్షణ జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకొని, ఇరుసంఘాల విద్యార్థులను అదుపు చేశారు.

కాగా, క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్‌ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్‌, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గుర్తు తెలియ‌ని ఏబీవీపీ విద్యార్తుల‌పై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ తెలిపారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఉత్కంఠ మ్యాచ్.. ఆర్సీబీదే విజయం!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

రామరాజ్యమే లక్ష్యం!

వేర్పాటువాద నేత యాసిన్‌కు యావజ్జీవ శిక్ష..కశ్మీర్‌లో హైఅలర్ట్

బ్యాట్ తో బాదిన భార్య‌.. కోర్టును ఆశ్ర‌యించిన భ‌ర్త‌..!

ఈ సారీల గోలేంట్రా బాబూ..?

బిగుసుకుంటున్న ఉచ్చు..చిదంబరంపై ఈడీ కేసు

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

ఫిల్మ్ నగర్

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

అందుకే రియాలిటీ షోలు చేయను

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)