• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » మునిగిపోతున్న దేవభూమి.. ఇక మటుమాయం ?

మునిగిపోతున్న దేవభూమి.. ఇక మటుమాయం ?

Last Updated: January 13, 2023 at 3:07 pm

ఉత్తరాఖంఢ్ ఛమోలీ జిల్లాలోని జోషీమఠ్ ఇక పూర్తిగా కనుమరుగు కానుందా? భూమి లోపలికి కుంగిపోయి.. ఆనవాలు లేకుండా పోతుందా ? ఇలాంటి అనుమానాలకు, భయాందోళనలకు తావిస్తున్న శాటిలైట్ ఇమేజీలు వెలుగు చూశాయి. ఈ ఇమేజీలను ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసింది. ‘కార్టోశాట్-2 ఎస్’ శాటిలైట్ తీసిన ఈ ఫొటోలు .. ఆర్మీకి చెందిన హెలిపాడ్, ఓ ఆలయంతో సహా మొత్తం టౌనంతా ..రేపో, మాపో కనుమరుగుకావచ్చుననే సంకేతాలిస్తున్నాయి. అత్యంత సెన్సిటివ్ జోన్లుగా అన్ని ప్రాంతాలు కనిపించాయి.

Joshimath sank by 5.4 cm in just 12 days: ISRO report | udayavani

గత ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో భూమి మెల్లగా… 8.9 సెంటీమీటర్ల మేర కుంగిపోయినట్టు ఈ సంస్థ ఓ ప్రాథమిక నివేదికలో తెలిపింది. అయితే గత డిసెంబరు 27, ఈ ఏడాది జనవరి 8 మధ్య కాలానికి ఇది మరో 5.4 సెం.మీ. మేర కుంగిపోయిందట. కేవలం 12 రోజుల్లోనే నాటకీయంగా ఇలా జరిగిందంటే.. ఎంత త్వరగా ఈ ‘ముంపు’ సంభవిస్తుందో అంచనా వేయవచ్చునని ఈ నివేదిక పేర్కొంది.

కొండచరియలు విరిగి పడడం, అనేక చోట్ల భూమి నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు, భారీ వర్షాలు, భూప్రకంపనల ఫలితంగా ఇక ఈ దేవభూమి ప్రకృతిలో కలిసిపోవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేబట్టిన పలు జల విద్యుత్ కేంద్రాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని వారిదివరకే పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే ఆయన ఆర్మీ,ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, ఎండీ ఆర్ ఎఫ్ బృందాలతోను, సైంటిస్టులతోను కూడా తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే పోలీసు అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే జోషీమఠ్ లో రెండు హోటళ్లు, అనేక ఇళ్లను కూల్చివేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి ఒకటిన్నర లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap