• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. పాల్ ఆవేదన!

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. పాల్ ఆవేదన!

Last Updated: July 26, 2022 at 3:37 pm

ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలతో మోడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని మరో శ్రీలంకలా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ 76 లక్షల కోట్ల అప్పు చేశారన్న ఆయన.. వచ్చే ఎన్నికలలో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మోడీకి కూడా తాను లేఖలు రాశానని.. ఆరు నెలల్లో మన దేశం నాశనం‌ కాబోతోందని జోస్యం చెప్పారు. రోగికి డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన విధంగా.. దేశానికి మంచి మందు కావాలని అన్నారు.

దేశ ఆర్ధిక పరిస్థితిని గమనించి సరిదిద్దాలని చెప్పారు పాల్. దేశం, రాష్ట్రాలు ఆర్ధికంగా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని.. నాయకులు ప్రభుత్వ సంపదను దోచి పెడుతున్నారని ఆరోపించారు. అదానీకి అన్యాయంగా ఆస్తులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన బిల్లులోని అంశాలను అమలు చేయలేదని.. ఏపీ నాశనం‌ కావడానికి నలుగురు ప్రధాన కారణమని వివరించారు.

మాజీ సీఎం చంద్రబాబు తాను చెప్పిన సలహాలను పట్టించుకోలేదని.. ఆయన ప్రధానమంత్రి కావడానికి, కుమారుడ్ని సీఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ‘‘ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. బూత్ కమిటీ లు అయ్యే వరకు జిల్లాల్లో తిరుగుతా. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు.. రూపాయి పుట్టే పరిస్థితి లేదు. తెలంగాణలో 5 లక్షల కోట్ల అప్పు.. ఏం చేశారో తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలి. చంద్రబాబుకు వయసు మళ్లింది.. ఇప్పుడయినా నాకు మద్దతు ఇవ్వండి. నేను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా’’ అని అన్నారు పాల్. చంద్రబాబు, జగన్, తాను ఒకే వేదికపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. చంద్రబాబు కలలో కూడా గెలవరని.. ఏపీలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని మండిపడ్డారు.

ప్రధాని ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. అనేక మంది జాతీయ నాయకులు తనను కలుస్తున్నారని.. కేసులతో వేధిస్తారని మోడీకి అందరూ భయపడుతున్నారని చెప్పారు. దేశంలో మార్పు రావాలంటే.. అందరూ తనకు మద్దతు ఇవ్వాలన్నారు. జగన్ తండ్రి, తల్లి తనకు ఎంతో గౌరవం ఇచ్చారన్నారు పాల్. కానీ.. ఆయన మాత్రం కలవటానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు. సీక్రెట్ గా అయినా ఆహ్వానిస్తే వెళ్లి కలుస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలని.. అప్పులు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని ఆయనకు ఇచ్చారని.. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి‌ వచ్చారని వివరించారు. నవ రత్నాలు ఇవ్వడానికి డబ్బులు లేవని.. ఇంకో ఆరు నెలలు ఈ‌ పథకాలకు డబ్బు ఎలా తెస్తారని ప్రశ్నించారు. అందుకే తనతో కలవాలని జగన్ కు ఆహ్వానం పంపారు. అలా కాకపోయినా తమ పార్టీలో చేరినా చూసుకుంటానని ఆఫర్ చేశారు పాల్.

ఇక పవన్ గురించి మాట్లాడుతూ.. పొత్తుల పార్టీలు మారుస్తూ వస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు తనకేం శత్రువులు కాదని అన్నారు. ‘‘ఈ అన్నయ్యతో కలువు… నీకు అంతా మంచి జరుగుతుంది. దశావతారాలు వద్దు.. నేనంటే పవన్ కు గౌరవం. తమ్ముడు ముందుకు వస్తే.. కలిసి పని చేస్తాం. కమ్యూనిస్టులు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది’’ అంటూ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు కేఏ పాల్.

Primary Sidebar

తాజా వార్తలు

గన్ ఫైటింగ్.. బీజేపీ ఎటాక్!

సల్మాన్ ఖాన్ చంపిన జింకకు స్మారక నిర్మాణం…!

పంజా విసురుతున్న పులి!!

ర‌జినీ స‌ర‌స‌న త‌మ‌న్నా!!

ప్రాజెక్టులు ఫుల్.. బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు!

స‌ర్పంచ్ భ‌ర్త దారుణ హ‌త్య‌!!

దృశ్యం 3 వ‌చ్చేస్తోంది…!!

బౌల‌ర్ల‌తో ఆడుకున్న మ‌లాన్‌…!!

కాశ్మీర్ లో ఉగ్ర దాడి.. పోలీస్ మృతి

భారత్ కు స్పేస్ నుంచి ఇటాలియన్ ఆస్ట్రోనాట్ శుభాకాంక్షలు…!

స్పందించిన స‌ల్మాన్ ర‌ష్దీ..!!

షేర్ మార్కెట్ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నుమూత!!

ఫిల్మ్ నగర్

ర‌జినీ స‌ర‌స‌న త‌మ‌న్నా!!

ర‌జినీ స‌ర‌స‌న త‌మ‌న్నా!!

దృశ్యం 3 వ‌చ్చేస్తోంది...!!

దృశ్యం 3 వ‌చ్చేస్తోంది…!!

అతిలోక సుందరిని గుర్తు చేసుకున్న అందాల భామ....!

అతిలోక సుందరిని గుర్తు చేసుకున్న అందాల భామ….!

రాధిక మారిపోయిందా...??

రాధిక మారిపోయిందా…??

ఆ పిచ్చి జోక్ కి హాయిగా న‌వ్వుకున్నాం!!

ఆ పిచ్చి జోక్ కి హాయిగా న‌వ్వుకున్నాం!!

బీజేపీలోకి సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర‌!!

బీజేపీలోకి సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)