పాలిటిక్స్ నుంచి తప్పుకోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ.. తాను పదే పదే ఢిల్లీకి వెళ్లి రావడం వెనుక వ్యక్తిగత కారణం ఏమీ లేదని.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని చట్టప్రకారం బయటకు తీయడానికే అని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో నాయకులకు పర్సనల్ ఎజెండా తప్ప.. ప్రజల ఎజెండా ఎవరికీ లేదని అన్నారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డితో తనకు ఒక్క డిబేట్ ఏర్పాటు చేస్తే అసలు వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతానన్నారు పాల్.
ప్రజలు తమ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణకు తాన ముఖ్యమంత్రిగా.. ఏపీకి బీసీ మహిళను సీఎంగా చేస్తానన్నారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని కేఏ పాల్ వెల్లడించారు.
ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ను చూసి జగన్ వాతలు పెట్టుకుంటున్నారని తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచితే ఏపీలో జిల్లాలు పెంచారని ధ్వజమెత్తారు కేఏ పాల్.