ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో అరుదైన ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్’ గా గుర్తించి అవార్డును ప్రదానం చేసింది.
ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వీకరించారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో నీటి కరువు ఉండేదని.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అతి తక్కువ సమయంలోనే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసిన విధానాన్ని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాక ముందు సాగునీరు అందక కరువుకు నిలయంగా ఉండేదని.. భారీ ప్రాజెక్టుల నిర్మాణాలతో అనేక అద్భుతమైన మార్పులు జరిగాయని.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం మారిందని కేటీఆర్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించటం, అవార్డును అందుకోవటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రసంగంతోపాటు, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించిన డాక్యుమెంటరీని వీక్షించిన ప్రతిఒక్కరు ‘అపర భగీరథుడు కేసీఆర్’ అంటూ కొనియాడుతున్నారు.
A rare honour for Telangana on a global platform!
Telangana’s groundbreaking irrigation project, an engineering marvel – #KaleshwaramProject, wins accolades at the prestigious Civil Engineers’ Congress.
The American Society of Civil Engineers (ASCE) has proclaimed the… pic.twitter.com/wfbAgKHat6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 22, 2023