అమ్మకాబోతున్న ఆవుకు సీమంతం చేసి,తమ గొప్పమనసు చాటుకున్నారు. తమిళనాడులోని కల్లకురిచ్చిజిల్లా శంకరాపురం గ్రామంలోని ట్రస్ట్ సిబ్బంది. గర్భిణిగా ఉన్న అంశవేణి అనే అవుకు అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిపించారు. సీమంతం వేడుకకు అంశవేణిని బాగా అలంకరించారు.
అంశవేణి సంరక్షణ చూస్తున్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫంక్షన్ కు దాదాపు 500 మంది అతిథులు హాజరు కాగా వారందరికీ 24 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. వేడుకకు హాజరైన వారు ఆవుకు గిఫ్ట్స్ కూడా అందించారు.
మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి. సీమంతం వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు అంశవేణికి స్నానం చేయించారు. అనంతరం పూలు, గంటలతో అంశవేణిని అలంకరించారు. కార్యక్రమం పూర్తయ్యాక వచ్చిన అతిథులంతా అంశవేణి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.