వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు షూను బహుకరిస్తానని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జీవీ రామకృష్ణా రావు రియాక్ట్ అయ్యారు.
బీఆర్ఎస్ నేతల దాడి చేసే అవకాశమున్నందున మెడికల్ కిట్ ను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. షర్మిలకు మెడికల్ కిట్ ను బహుమతిగా పంపారు.
పాదయాత్రకు బయలుదేరే ముందు దాన్ని వెంట తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణకు వైఎస్ పచ్చి వ్యతిరేకన్న రామకృష్ణ.. ఆయన బిడ్డైన షర్మిలకు తెలంగాణలో మాట్లాడే అర్హత లేదన్నారు.
తెలంగాణ గడ్డతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నారు. షర్మిలకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్ర చేసుకోవాలన్నారు జీవీ రామకృష్ణా రావు.