బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 11 గంటలు దాటినా కూడా ఆమె తన నివాసంలోనే ఉన్నారు.
న్యాయ నిపుణులతో కవిత చర్చిస్తున్నారు. ఆలస్యంగా ఈడీ విచారణకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ రెండో సారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 11న కవిత ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ఇవాళ ఉదయం 10 గంటలకు మీడియాతో మాట్లాడి ఈడీ విచారణకు వెళ్లనున్నట్టుగా కవిత కార్యాలయ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే విచారణకు హాజరు కావడానికి ముందే కవిత న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
పలువురు మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరో వైపు ఈడీ అడిగిన సమాచారాన్ని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి పంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.