• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్..!

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్..!

Last Updated: January 15, 2022 at 1:56 pm

ఈసారి కూడా ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసుకోవాలని ఆయన ఆలోచన. ఒక వైపు రోజురోజుకి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత మరో వైపు బీజేపీతో వైరం. ఈ రెండు కారణాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని కేసీఆర్ వ్యూహంగా కనబడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ముందు దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఒక్కొక్క గ్రామంలో ప్రారంభించి దళితులను నమ్మించే ప్రయత్నం చేయాలని కేసీఆర్ వ్యూహం అని కూడా చెబుతున్నారు. టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్తగా నిన్నటి దాకా పనిచేసిన సునీల్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ (పీకే) ను నియమించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఐప్యాక్ టీమ్ తెలంగాణలో పనిచేసేందుకు 300 కోట్లు రూపాయల ప్యాకేజ్ తో పీకేతో ఒప్పందం కుదిరించుకున్నారని.. దీనిపై తమకు సమాచారముందని అని కూడా వారు అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిలువరించేందుకు బీజేపీనే తమకు పోటీ అన్నట్లుగా రాజకీయ వాతావరణం స్పష్టించాలి అనేది పీకే వ్యూహం అని తెలుస్తుంది. అప్పుడే టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పీకే చెప్పినట్టు టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అందుకే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు అని చెబుతున్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ బండి సంజయ్ పై వరస ప్రెస్ మీట్ లు పెట్టి దుమ్మెత్తి పోయడమే కాకుండా ఆయన నల్లగొండ పర్యటనలో దాడి చేయించారని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో బండి సంజయ్ దీక్షను భగ్నం చేయాల్సిన అవసరం లేకున్నా గ్యాస్ కట్టర్స్ ను, వాటర్ క్యానార్స్ ను ఉపయోగించారు. అంతే కాదు ఆయనను జైలుకు కూడా పంపారు అని చెవులు కోరుకుంటున్నారు. బీజేపీను పికప్ చేయడం వలన రాజకీయంగా టీఆర్ఎస్ కు లాభం అనేది గులాబీ బాస్ ఆలోచన అని కూడా పార్టీ తమ్ముళ్లు మాట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ లో జవసత్వాలు వచ్చి ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గజ్వేల్ సభ తరువాత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి చురుకు తగిలింది అని గుర్తు చేస్తున్నారు. రేవంత్ కి తోడు హుజూరాబాద్ లో ఈటెల గెలవడం కేసీఆర్ కు ఆందోళన మొదలైంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హుజూరాబాద్ ఎన్నికలలో డబ్బు అధికార ఒత్తిళ్లు ప్రలోభాలు పనిచేయలేదని కేసీఆర్ గుర్తించారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత కూడా రోజురోజుకు పెరుగుతుంది అని కేసీఆర్ గుర్తించాడని అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఒక వైపు సాంప్రదాయ ఓటు బ్యాంక్ బలంగా వున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో దూకుడుగా వ్యవహరించడం మరో వైపు బలమైన సామాజిక వర్గం ప్రతినిధిగా వున్న ఈటెల ఉపఎన్నికలో గెలిచి దూకుడు పెంచడంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అని అంటున్నారు.

అయితే ఎన్నికల లోపు అటు బీజేపీని పికప్ చేయడంతోపాటు తన కోవర్ట్ లతో కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించి రేవంత్ రెడ్డి దూకుడుకి కళ్ళెం వేయాలి. ఇటు బండి సంజయ్ ను లేపడం ద్వారా ఈటెల స్పీడ్ కి బ్రేకులు వేయాలనే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళుతున్నాడు అని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉంటూ మనకు అనుకూలంగా పని చేస్తున్న నాయకులు కొందరు ఎన్నికల నాటికి టీఆర్ఎస్ లో చేరతారని కేటీఆర్ కొంత మంది నాయకుల దగ్గర మాట్లాడినట్లు తెలుస్తోంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీని పికప్ చేయడం వలన క్రిష్టియన్ ముస్లిం మైనార్టీలు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆందోళనతో టీఆర్ఎస్ కు ఓటు వేస్తారు. అదే కాంగ్రెస్ అధికారంలో వస్తుందనే విశ్వాసం మైనార్టీల్లో కలిగితే వారు టీఆర్ఎస్ కు ఓటు వేయరని కూడా కేటీఆర్ వారి దగ్గర విశ్లేషించినట్లు తమకు సమాచారముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి మొత్తానికి బహుముఖ వ్యూహంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

పుట్టిన పిల్లలకు వెంటనే కొత్త బట్టలు ఎందుకు వేయరు…? పుట్టబోయే బిడ్డకు ముందుగా బొమ్మలు ఎందుకు కొనరు…?

పంచభక్ష్య పరమాన్నాలు అంటే అర్ధం ఏంటీ…?

ప్లీజ్‌… ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

బీఆర్ఎస్ కు కేసీఆర్ గుడ్ బై..!

ఈసారి ఖైరతాబాద్‌ గణేశుడి రూపం ఇదే!

కాషాయ పండుగకు ఏర్పాట్లు షురూ

శిథిల నగరం.. ఆసక్తికర అంశాలు

సొమ్ము జనానిది.. సోకు మేఘాది!

కారులో తల్లి కూతుర్లపై.. ఉత్తరాఖండ్ లో దారుణ ఘటన

టీడీపీ పొమ్మంటుందా! వైసీపీ రమ్మంటుందా!!

మహా సర్కార్ కు సుప్రీం నోటీసులు…!

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

ఫిల్మ్ నగర్

ప్లీజ్‌... ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

ప్లీజ్‌… ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!

రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!

అమ్మవుతున్న అలియా!

అమ్మవుతున్న అలియా!

ఆషాడం లో కొత్తగా పెళ్లైన వారు దూరంగా ఉంటారు...ఎందుకో తెలుసా ?

ఆషాడం లో కొత్తగా పెళ్లైన వారు దూరంగా ఉంటారు…ఎందుకో తెలుసా ?

హీరోయిన్ శోభితతో నాగ చైతన్య కు ఉన్న సంబంధం ఏంటి ?

హీరోయిన్ శోభితతో నాగ చైతన్య కు ఉన్న సంబంధం ఏంటి ?

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇచ్చాడు.. వాటా తీసుకున్నాడు

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇచ్చాడు.. వాటా తీసుకున్నాడు

రిలీజ్ కు ముందే ఆ సినిమాకు నష్టాలు!

రిలీజ్ కు ముందే ఆ సినిమాకు నష్టాలు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)