కేసీఆర్ విషయంలో ప్రతిపక్ష నాయకులు చాలా కాలంగా ఓ విమర్శ చేస్తున్నారు. బీఆర్ఎస్ లో భజన చేసే వారికే స్థానం ఉంటుందని.. ఉద్యమకారులైనా సరే కేసీఆర్ ను పొగడకుండా వారికి కనీసం మర్యాద కూడా లభించదనే ఆరోపణలున్నాయి.
వేదిక ఏదైనా సీఎం ను ఆకాశానికి ఎత్తడంలో కొంత మంది బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతుంటారు. తాజాగా అదే బాటలో నడిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పై అసెంబ్లీ సాక్షిగా రసమయి ప్రదర్శించిన అతిభక్తి… మరీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పరిస్థితికి అద్దం పడుతోందనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రెసిడెన్షియల్ పాఠశాల అభివృద్ది పై అసెంబ్లీలో మాట్లాడిన రసమయి బాలకిషన్..సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక గొప్పగా మార్చివేశారని చెప్పుకొచ్చారు.ఈ సంద్భంగా ఓ తెలుగు పాటను వినిపిస్తూ.. ‘చెట్టులెక్కగలవా ఓ నరిహరి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా’ అంటూ గతంలో చిటారు కొమ్మవరకు ఆగిపోయారు.
కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరెస్ట్ అధిరోహిస్తున్నారని, ఎవరెస్ట్ శిఖరాన్ని తమ కాళ్ల కింద తొక్కెటట్టు మా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశాడని ఆకాశానికెత్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే రసమయి బాలకిషన్ ను నెటిజన్లు కామెంట్లతో టార్గెట్ చేస్తున్నారు. రెసిడెన్షియల్ లో చదువుకున్న పూర్ణ మాలావత్ 2014 మే 25న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తే.. 2014 మే 2 న సీఎం అయిన కేసీఆర్ గొప్పతనమేముందని నిలదీస్తూ సెటైర్లు వేస్తున్నారు.