జగిత్యాల జిల్లా పై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
కేసీఆర్ జగిత్యాల జిల్లాకు ఎలాంటి వరాలు కురిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టుకు 100 కోట్లు
కేటాయించినట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని ఆయన కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం చెరుకు రైతుల కల అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు. జిల్లాలోని గ్రామ సర్పంచులకు ప్రతి గ్రామానికి 10 లక్షల నిధులు కేటాయించాలన్న ఆయన.. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలన్నారు.
స్థానిక ప్రజల కోరిక మేరకు వడ్డలింగాపూర్, అల్లీపూర్ ను మండలాలుగా ప్రకటించాలన్నారు.