న్యూఢిల్లీః సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుముని ఈ ఏడాది ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపించారు. 10, 12వ తరగతి పరీక్ష ఫీజులను సీబీఎస్ఈ ఇటీవల భారీగా పెంచినందునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » కేజ్రీవాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..!