ఏకాదశి సందర్భంగా తిరుమలలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 13న ఏకాదశి రోజున వైకుంఠ ద్వారదర్శనం ప్రారంభమౌతుందని చెప్పారు వైవీ. కోవిడ్ నిభందనలు సడలిస్తే పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ఉంటుందన్న ఆయన.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తామని తెలిపారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
11 మంది చిన్నపిల్లలకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స
చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం
పాలకమండలి సభ్యులు కూడా విరాళాలు అందించేందుకు అంగీకారం
ప్రస్తుతం ఖాళీగా వున్న 500 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు భక్తులకు కేటాయింపు
హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంత అభివృద్ధి
నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మంటప నిర్మాణం
భక్తుల సౌకర్యార్థం రోడ్డు మార్గంగా అన్నమయ్య నడకమార్గం అభివృద్ధి
హిందు ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు
వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాల పునర్ నిర్మాణం
ఐటీ విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు
రూ.2.6 కోట్ల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు
శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు
తాళపత్ర గ్రంథాలను పరిరక్షించడానికి ఎస్వీ వేద విద్యాలయంలో ఓ విభాగం ఏర్పాటు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం
భక్తులకు శ్రీ వేంకటేశ్వర నామ కోటి పుస్తకాల పంపిణీ
కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును రూ.11 నుంచి రూ.15 పెంపు
రూ.3 కోట్ల వ్యయంతో వసతి గదుల్లో గీజర్ల ఏర్పాటు
రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్ లో భవనాల నిర్మాణం
రూ.12 కోట్ల వ్యయంతో మహిళా యూనివర్సిటీలో హస్టల్ భవనాల నిర్మాణం