వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల తయారీ నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో తయారు చేసిన విగ్రహాలను హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. వాటిని కేవలం జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని సూచించింది.
పీవోపీ విగ్రహాల నిషేధంపై కేంద్ర కాలుష్య మండలి గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై విగ్రహ తయారీ దారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో జారీ చేయలేదని హైకోర్టు వెల్లడించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై తాము ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని కోర్టు వెల్లడించింది.
విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అభ్యర్థను హైకోర్టు తోసి పుచ్చింది. దుర్గా పూజపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది.