తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ (టీఎస్ రెరా)కి చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారినే నియమిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవికి కొద్ది రోజులుగా కొందరు ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి.
ఏపీకి వెళ్లి వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్ ను నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే రెరా బాధ్యతలను కూడా అప్పగించారు.
కాగా అనేక అవకతవకల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని శాంతికుమారి ఎలా నియంత్రిస్తుందో వేచి చూడాలి. ప్రధానంగా ప్రీలాంచ్ ఆఫర్లతో వందల కోట్లు ముందే వసూలు చేస్తున్న బడా కంపెనీలపై చైర్మన్ ఏవిధంగా చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటివకైతే రెరాకి ఎన్ని ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అపవాదు ఉంది. చైర్మన్ నియామకం తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.