విడుదలైనప్పటి నుండి తన మార్క్ ను చాటుకుంటోంది కేజీఎఫ్-2. కేజీఎఫ్-1 కు సీక్వెన్స్ గా వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యశ్ ఫోబియా పట్టుకున్నట్టైంది. రాకింగ్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. వసూళ్ల పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. దంగల్ వంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన కేజీఎఫ్-2.. ఇప్పుడు మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1200 కోట్లు వసూల్ చేసి అరుదైన రికార్డును అందుకుంది. దీంతో దంగల్, బాహుబలి ది కన్క్లూజన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్, బీస్ట్ చిత్రాల పోటీని తట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. విడుదలై నెల రోజులు గడిచిపోయినప్పటికీ కేజీఎఫ్-2 హావా మాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకులకు యశ్ ఫోబియో పట్టుకున్నట్టే ఇప్పటికీ.. సినిమాను చూసేందుకు తరలివెళ్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 సినిమా రూ. 1200 కోట్లు క్రాస్ చేసిందని ట్రెడ్ అనలిస్ట్ మనోబాల విజయ్ బాలన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 1వ వారంలో రూ. 720.31 కోట్లు.. 2వ వారంలో రూ. 223.51 కోట్లు.. 3వ వారంలో రూ. 140.55 కోట్లు.. 4వ వారంలో రూ. 91.26 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. 1వ వారంలో కేవలం ఒక ఐదవ రోజే రూ. 5.20 కోట్లు.. 2వ రోజు రూ. 4.34 కోట్లు.. 3వ రోజు రూ. 6.07 కోట్లు.. 4వ రోజు రూ. 9.52 కోట్లుతో మొత్తం రూ. 1200.76 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ను పదిల పరుకుందంటూ ట్వీట్ చేశారు బాలన్.