ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గద్దర్ కు రూ.150 కోట్లిచ్చి.. మునోగుడు ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు.
పాలనపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా? అని ప్రశ్నించారు.
బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి జరగాలంటే కేఏ పాల్ అధికారంలోకి రావాలన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరుతామని లక్షల మంది వాట్సప్ మెసేజ్ లు చేస్తున్నారని చెప్పారు.
70 శాతం తెలంగాణ ప్రజలు కేఏ పాల్ పాలన కోరుకుంటున్నారని.. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు కేఏ పాల్.