భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కియారా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈ అమ్మడికి లస్ట్ స్టోరీ వెబ్ సిరీస్ మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కియారా అడ్వాణీ ఇప్పుడు మరో వెబ్సిరీస్లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవితంపై మసాబా మసాబా పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్గా కనిపించనుంది. మసాబా స్టోర్కి వెళ్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ వెబ్సిరీస్ గురించి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చేసింది. ఇందులో నువ్వు ఓ గెస్ట్రోల్ చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నానని తెలిపింది.