కియారా అద్వానీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ బాలీవుడ్ భామ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక బాలీవుడ్ లో కూడా దూసుకుపోతోంది. ఇటీవల బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైతే అందాల ఆరబోత చెయ్యొద్దా అంటూ గ్లామర్ డోస్ ను పెంచేసింది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్లతో పాటు తన అందమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను దగ్గరవుతుంది. ఫాలోయింగ్ని పెంచుకుంటుంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అవి కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచిన కియారా అద్వానీ హాట్ ట్రీట్ అదిరిందంటూ కామెంట్లను అందుకుంటుంది.
ఈ అమ్మడు కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో రామ్ చరణ్ సరసన కూడా ఓ సినిమా చేసింది. అది డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. పెళ్లి తర్వాత తొలిసారి ఊహించని స్థాయిలో ఇలా అందాల ప్రదర్శన చేయడం చూసి అంతా షాకవుతున్నారు.
మ్యారేజ్ తర్వాత కూడా కియారా ఇంత స్టైలిష్ గా రెడీ అవుతుందని అస్సలు అనుకోలేదంటూ ఈ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రొఫెషనల్ లైఫ్ తో వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కియారా ఈ ఫొటోలతో స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా.. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కియారా అద్వానీ.
సినిమా సినిమాకు తన క్రేజ్ రెట్టింపయ్యేలా మేకోవర్ అవుతోంది. తాజాగా ఆమె కనిపించిన విధానాన్ని బట్టి చూస్తే పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా కియారా స్టెప్స్ వేగంగా పడబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు మరోసారి తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. యెల్లో కలర్ మినీ స్కర్ట్ లో ఎద అందాలను చూపిస్తూ యూత్ కు మత్తెక్కిస్తుంది.. అవి చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లను చేస్తున్నారు..