కనిపించే డాక్టర్ నే దేవుడని భావిస్తూంటారు ప్రజలు. డాక్టర్ ని నమ్మి తమ ప్రాణాలను వారి చేతుల్లో పెడుతూంటారు. అలాంటి వైద్యుడు ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ రెండు కిడ్నీలు చోరీకి గురయ్యాయి. మరోవైపు సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటానని పెళ్లి ప్రమాణాలు చేసిన భర్త కూడా ఆమెను అనాథగా వదిలేసి పారిపోయాడు. ముగ్గురు పిల్లలతో ఆ మహిళ ధీన స్థితిలో రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బీహార్ ముజఫర్ పూర్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన సునీత అనే మహిళ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ నర్సింగ్ హోమ్ కు వెళ్లింది. అక్కడ డాక్టర్ రెండు కిడ్నీలు తీసేశాడు. అనంతరం డాక్టర్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం సునీత ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. రోజురోజుకూ ఆమె పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రతి రెండు రోజులకోసారి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సునీత ముగ్గురు పిల్లలు కూడా తమ తల్లి పరిస్థితిని అమాయక కళ్లతో చూస్తుండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులు.
ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలియటం లేదని, తన ఆరోగ్యం సరైన స్థితిలో ఉన్నప్పుడు తానే కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే దానిని, ఇప్పుడు రెండు కిడ్నీలు లేకపోవడంతో ఏ పనిచేసుకోలేక పోతున్నానంటూ రోదిస్తుంది. ఆసుపత్రి యాజమాన్యం కూడా సునీతకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. చాలా మంది కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆమెకు సరిపోకపోవడంతో మార్పిడి చేయలేకపోయారు.
సెప్టెంబర్ 3న సునీతాదేవి గర్భాశయానికి ఆపరేషన్ చేయకుండా నకిలీ వైద్యులు కిడ్నీలను తొలగించారు. మహిళ పరిస్థితి విషమించడంతో, డాక్టర్, క్లినిక్ డైరెక్టర్ పవన్ ఆమెను పాట్నాలోని నర్సింగ్ హోమ్లో చేర్పించి అక్కడ్నుంచి పరారైనట్లు తెలిసింది. వైద్యులు మోసపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు పవన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.