• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి.. 5 ఎక‌రాల భూమి కేటాయించాలి..!

100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి.. 5 ఎక‌రాల భూమి కేటాయించాలి..!

Last Updated: June 30, 2022 at 4:46 pm

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కార్మికుల వైద్య అవసరాలను గుర్తించి.. హైదరాబాద్ తో పాటు.. ఇతర జిల్లాల్లోనూ ఈఎస్ఐ వైద్య సేవలను అందించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2018 లోనే రామగుండంలో వంద పడకల అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సంకల్పించిందని పేర్కొన్నారు. ఈ మేరకు అప్పుడే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. కేంద్ర కార్యాలయం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందనే విష‌యాన్ని లేఖ‌లో పేర్కొన్నారు కిష‌న్ రెడ్డి.

ఆ త‌ర్వాత కూడా ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం అనేక సార్లు రాష్ట్ర‌ప్రభుత్వానికి లేఖ‌లు రాసింద‌ని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేద‌నే విష‌యాన్ని గుర్తు చేశారు.దీనికి సంబంధించి తాజాగా.. మే నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశలో రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కావ‌ల్సిన భూమి ప్ర‌స్థావ‌న వ‌చ్చింద‌న్నారు.

భూమి కేటాయింపులో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి చర్చించడం జరిగిందని లేఖ‌లో రాశారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి రామగుండం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న వేలాది కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని కోరారు. సీఎం వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే ఆసుపత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామ‌ని లేఖ‌లో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.

Primary Sidebar

తాజా వార్తలు

నిలిచిపోనున్న విద్యుత్‌!!

నాణేలు పోయాయి..రంగంలోకి సీబీఐ!!

తాగి వీరంగ‌మాడిన కానిస్టేబుల్‌!!

కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి: సీత‌క్క‌

అమిత్ షా మునుగోడు షెడ్యూల్ ఖ‌రారు!!

అవ‌స‌ర‌మే లేదు.. అదే కూలిపోతుంది!!

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి: కోదండరాం

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీసీ ల‌కు టికెట్ ఇవ్వాలి

గబ్బిలం ఇంట్లోకి రావడం ఎందుకు అపశకునం అనే వారు…?

పౌర్ణమి రోజు అలలు ఎందుకు ఎక్కువగా వస్తాయి…?

ధ‌నిక రాష్ట్రం అయిన‌ప్పుడు జీతాలు ఎందుకిస్తలేరు?

మహిళలు ఎందుకు నిద్రలేమితో ఇబ్బంది పడతారు…?

ఫిల్మ్ నగర్

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)