ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి పై కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు. తనని చంపుతానంటూ ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకును ఫోన్ చేసి బెదిరించారని అన్నారు. మాణిక్ రావు థాక్రే కు ఫిర్యాదు చేశానన్నారు. ఈ అంశం ఏఐసీసీ పరిధిలోకి వెళ్లింది కనుక ఇక ఏమీ మాట్లాడను, పార్టీకి నష్టం చేసే చర్యలు చేయనన్నారు. క్షమాపణలు చెప్పాలని కూడా అడగనని, ఆయన వల్ల మునుగోడులో పార్టీకి నష్టం జరిగినా,పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు.
వెంకట్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నేను అడగలేదన్నారు ఆయన. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీని కోరామన్నారు. బడుగు,బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుదని.. కోమటి రెడ్డికి బెదిరింపు ఫోన్లు ఎవరు చేస్తున్నారో తనకు తెలియదన్నారు.
నల్లగొండలో మేము ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు లేవని..సోషల్ మీడియాలో ఎవరో ఏదో కామెంట్స్ చేశారని కార్యకర్తలను రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టారన్నారు. కోమటి రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.