కొజికోడ్ విమాన ప్రమాదం ఇప్పటికే తీవ్ర విషాదాన్ని నింపగా.. మరో ఆందోళనకరమై విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తెలిసింది. దీంతో విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్నవారిలో ఆందోళన మొదలైంది.అలాగే విమానంలో వచ్చిన ప్రయాణికులు టెన్షన్ పడుతున్నారు.
విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని… ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ సర్కార్ వారికి సూచించింది. ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
విమాన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను రక్షించడానికి CISF, ఎయిర్పోర్పోర్ట్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. దీంతో పాజిటివ్గా తేలిన మృతదేహాన్నిఎవరు తరలించారో.. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.