‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కృతీశెట్టి.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అవకాశాలు క్యూ కట్టాయి. దనికి తోడు చిత్రాలను సెలక్ట్ చేసుకోవడంలోనూ ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది కృతీ. నేచురల్ స్టార్ నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కృతీ కంటే.. సాయిపల్లవికే ఎక్కువ పేరు తెచ్చిపెట్టినప్పటికీ.. తన క్రెజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఇక ‘బంగర్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది కృతి. ప్రస్తుతం నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ అందాల భామ. ‘ఉప్పెన’తో కృతీని తెలుగు సినిమా రంగంలోకి తీసుకొచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తాము నిర్మిస్తున్న మరో సినిమాలోనూ కృతీనే హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం గమనార్హం.
కృతీశెట్టి ప్రస్తుతం రామ్ సరసన తెలుగు, తమిళ చిత్రం ‘ది వారియర్’లో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆయన నాగచైతన్య హీరోగా నిర్మించ బోతున్న తెలుగు, తమిళ చిత్రంలోనూ కృతీశెట్టినే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తాజాగా ప్రకటించారు.
Advertisements
ఏది ఏమైనా.. కృతిశెట్టితో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు ఆమెతో మరోసారి వర్క్ చేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. అంతే కాదు.. కృతీ నాగచైతన్యతో నటించడం కూడా ఇది రెండోసారి. ఆ మధ్యలో కృతీశెట్టి పారితోషికం భారీగా పెంచేసిందని, ఆమెతో కొంచెం కష్టమని, యాటిట్యూడ్ చూపిస్తుందని కొన్ని విమర్శలు వస్తున్నాయి.