కథానాయిక కృతి సనన్ గురించి తెలియన యువత లేదు. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు కృతి అంటే గుర్తే…ఈ మధ్య కాలంలో తెలుగులో ఏమి చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో బీజీ అయ్యింది ఈ భామ.
తాజాగా ఓ ఫంక్షన్ లో మెరిసిన కృతి అందరి దృష్టిని తన వైపు మళ్లించుకుంది. బ్యాక్లెస్ డ్రెస్ తో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది ఈ సుందరి. అయితే తాజాగా ముంబయిలో జరిగిన సినిమా అవార్డుల ఫంక్షన్కు బ్యాక్ లెస్ బ్లాక్ గౌన్లో మెరిసింది.
అందరిని ఆకట్టుకునేలా ఉండే ఆమె అందం, ఆ నల్లటి డ్రెస్ వల్ల అది మరింత రెట్టింపు అయ్యింది. దీంతో చర్చ అంతా ఆ గౌను పైనే జరుగుతోంది.ఆమె అందానికి మరింత అందాన్ని పెంచిన ఆ గౌను ఖరీదు తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ గౌను కోసం కృతిసనన్ భారీగానే ఖర్చుపెట్టింది. దాదాపు రూ.7.4 లక్షలు వెచ్చించి ఆ బ్లాక్ గౌన్ను కృతి ప్రత్యేకంగా తయారు చేయించుకుంది. దీనిని క్రిస్టియన్ అడ్నెవిక్ అనే డిజైనర్ ప్రత్యేకంగా తయారు చేశారు.
ఆ గౌనుతో దిగిన చిత్రాలను కృతి ఇన్స్టాలో షేర్ చేయగానే అది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది.