హొట్లాస్, ఫుడ్ బిజినెస్ రంగంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు బిజినెస్ లు కాకుండా కొందరు స్టార్లు ఫిట్ నెస్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఫిట్ నెస్ రంగంలో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రకుల్.. ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా విశాఖపట్నంలో జిమ్ లు ఓపెన్ చేసి ఫిట్ నెస్ పెంచేస్తోంది.
తాజాగా ఈ భామకు గట్టి పోటీ రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్.. తాజగా ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది. అయితే.. ఆప్పుడు ఆమో కూడా ఫిట్ నెస్ రంగంలోకి దిగుతున్నట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. అందుకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఈ బ్యూటీ కూడా రకుల్ తరహాలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా కృతి `ది ట్రైబ్` అనే జిమ్ ను ఓపెన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇది వర్చువల్ అండ్ ఇన్-స్టూడియో శిక్షణ. ట్రైనర్ మేడ్ న్యూట్రిషన్ .. కార్పొరేట్ వెల్ నెస్ ను అందించే వెల్ నెస్ స్టూడియో అంటూ ట్యాగ్ చేసింది. ”ది ట్రైబ్ శిక్షకుల ద్వారా మీకు మీరుగా అత్యుత్తమ.. ఉత్తమమైన వెర్షన్ గా మారడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తామని నమ్ముతున్నాము” పేర్కొంది కృతి.
”ఇది ఇన్-స్టూడియో.. గ్రూప్, పర్సనల్ లేదా వర్చువల్ సెషన్ లతో కొంతమంది చక్కని చిన్న వయస్సు ఫిట్టెస్ట్ ట్రైనర్ లతో శిక్షణ కార్యక్రమమిదని వివరించిన కృతి.. వర్కౌట్ లను చాలా సరదాగా చేయండి!” అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ భామ పోటీని రకుల్ తట్టుకుంటుందా..? లేక రకుల్ పోటీని తట్టుకోలేక ఈ భామే తప్పుకుంటుందా..? అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.