• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మాకు కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది

Published on : February 13, 2020 at 3:22 pm

 

ఢిల్లీలో టైమ్స్ నౌ సమ్మిట్ 2020 లో పాల్గొన్న తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై న చర్చా గోష్టిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ….

దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని, దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలు ఏవి లేవని,బిజెపి. కాంగ్రెస్ లు సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే అన్నారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్నున్నా వాటి ఆచరణ అంతా కూడా రాష్ట్రాల్లోనే ఉన్నది… కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో కీలకంగా ఉంటుంది, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదు… రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదు…ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి రాష్ట్రానికి కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని కేంద్రం రాష్ట్రానికి కొత్తగా ఇచ్చింది ఏమి లేదు అన్నారు.

తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే… కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తాం.. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. కేవలం తమ వాదన లేదా ఐడియాలజీ కి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన… కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన మేము, ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించాము. డిమానిటైజేషన్ ద్వారా దేశానికి మంచి జరుగుతుంది, సంపూర్ణ క్రాంతి వస్తుంది అన్న ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం మాటలను నమ్మి మద్దతు ఇచ్చాము… కానీ డిమానిటైజేషన్ ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలిందని విమర్శించారు.

బీజేపీ కాంగ్రెస్ లు పరస్పరం టిఆర్ఎస్ ఆయా పార్టీలకు టీంలుగా విమర్శిస్తున్నాయి.. కానీ మేము తెలంగాణ ప్రజల పార్టీని అనే విషయాన్ని చెప్తున్నాము. గత కొంత కాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి… రానున్న భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అన్నారు.

రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేక పోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. సిటిజన్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వివాదాస్పద చట్టాల కన్నా దృష్టి పెట్టాల్సిన అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలు ఉన్నాయఎన్నడూ తమ పార్టీ అభిప్రాయం… భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని కేటీఆర్ అన్నారు..

మెర్స ర్ గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని జీవించడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుంది…భారతదేశాన్ని రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉంది. కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి, ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నాం…నీతి అయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు,ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్ గా ఉండాల్సిన అవసరం ఉంది అని… అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ అన్నారు.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ, రాజకీయాలు, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

శ్రీకారం వచ్చేస్తుంది....మహాశివరాత్రి ముహూర్తం

శ్రీకారం వచ్చేస్తుంది….మహాశివరాత్రి ముహూర్తం

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

కేజిఎఫ్ 2 కు యశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

మెగాస్టార్ ని కలిసిన సొహైల్

బంగారు బుల్లోడు రివ్యూ

బంగారు బుల్లోడు రివ్యూ

నాకు ప్రాణ భయం ఉంది... అర్జున్ రెడ్డి నటి

నాకు ప్రాణ భయం ఉంది… అర్జున్ రెడ్డి నటి

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

రంగారెడ్డి కలెక్టర్ గారు..వడ్డీతో సహా చెల్లించాలి

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

5 నెలలుగా క‌రోనా పాజ‌టివ్- 31సార్లు ప‌రీక్ష‌లు చేసినా పాజిటివే

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా...?

ఏపీలో ఇక క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ట్లేనా…?

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

బ్యాడ్ న్యూస్- ప్రేక్ష‌కులు లేకుండానే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మెరిసిన కొత్త కుర్రాళ్ల‌కు మ‌హీంద్ర బంప‌ర్ ఆఫ‌ర్

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

లాలూ ప‌రిస్థితి అత్యంత విష‌మం- ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)