సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూనగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్ల కేటాయింపు విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని.. లాటరీ పద్ధతిలో బస్తీవాసులందరికీ ఇళ్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించామని వెల్లడించారు మంత్రి. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మార్కెట్లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల విషయంలో ఎవరైనా లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.