రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ మరింత పెరిగిపోతోంది. ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా రాజ్భవన్ మారుతోందనే విమర్శల నేపథ్యంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు గవర్నర్ తమిసై.. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
వారితో భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. తమిళిసై వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. గవర్నర్ కు అవమానం ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
గవర్నర్.. గవర్నర్ గా వ్యవహరిస్తే గౌరవిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. మేం ఎక్కడా గవర్నర్ ను అవమానించలేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మాట్లాడిన మాటలు బాధించాయని వివరించారు.
గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదని పేర్కొన్నారు. పొలిటికల్ లీడర్ గా మీరు గవర్నర్ కావొచ్చు కానీ.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావొద్దా..? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ఏమైనా స్పందింస్తారా..? లేదా..? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.