రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం.. యథావిధిగా గుజరాత్కు తరలిపోయిందని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ మేరకు కేంద్రంపై నిప్పులు చెరుగుతూ.. ట్వీట్ చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగిస్తోందనేది మరోసారి రుజువైందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
సంప్రదాయ వైద్య కేంద్రంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు సున్నా అని కేటీఆర్ అన్నారు.
ఐఐఎస్ఈఆర్లు 2 కేటాయిస్తే అందులోనూ రాష్ట్రానికి ఏం లేదని మండిపడ్డారు. 16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఐడీలు 4, మెడికల్ కళాశాలలు 157ల్లోనూ తెలంగాణకు సున్నా అని వ్యాఖ్యానించారు.
84 నవోదాయల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ట్వీట్ చేశారు కేటీఆర్. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ హామీని విస్మరించారని మంత్రి కేటీఆర్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.