• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » మ‌ట్టి ప‌నికైనా.. మనోడు ఉండాలి:కేటీఆర్

మ‌ట్టి ప‌నికైనా.. మనోడు ఉండాలి:కేటీఆర్

Last Updated: April 20, 2022 at 6:13 pm

మ‌ట్టిప‌నికైనా మ‌నోడు ఉండాల‌ని వ్యాఖ్యానించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఉమ్మ‌డి వరంగల్​ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్​.. రూ. 193 కోట్ల రూపాయలతో ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అందులో భాగంగా రూ. 20 కోట్ల 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ రోడ్డు పనులు, రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్​, రంగంపేటలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు కేటీఆర్. అనంతరం రూ. 15 కోట్లతో నాలాల నిర్మాణం, పబ్లిక్ గార్డెన్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, రూ. 8 కోట్లతో మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం, రూ. 2 కోట్లతో స్పెషల్‌ పార్కు, రూ. 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు, రూ. 1.50 కోట్లతో వరంగల్‌ పోతననగర్​ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ. 80 లక్షలతో కేఎంజీ పార్కులో జాతీయ పతాకం, రూ. 4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు పనులు, హనుమకొండలో రూ. 22 కోట్లతో వరదనీటి కాల్వలకు రిటైనింగ్ వాల్స్, రూ. 15 కోట్లతో కల్వర్టులు, ఆర్​అండ్​బీఆర్​ సీసీ రిటైనింగ్ వాల్స్​కు శంకుస్థాపనలు చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు బయలుదేరారు.

నర్సంపేటలో రూ. 43.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్​ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​వెజ్ మార్కెట్​కు శంకుస్ధాపన చేశారు. రూ. 50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనం రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన మెప్మా నూతన భవనం, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లో రూ. కోటి వ్యయంతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్​ను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట బైపాస్ రోడ్ ​లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగించారు.

కేంద్రంలో బీజేపీ మాటలు తప్ప చేతలు కనిపించట్లేద‌న్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో ప‌థంలో న‌డిపేందుకు సీఎం కేసీఆర్ ముంద‌డుగేస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ‌లో ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు కేటీఆర్. గతంలో రైతులకు పెట్టుబడి ఇచ్చిన సీఎంలు ఎవరైనా ఉన్నారా.? అని నిల‌దీశారు. రైతుబంధు కింద రైతులకు ఇప్పటికే రూ.50 వేల కోట్లు ఇచ్చామ‌న్నారు. రుణమాఫీ పథకానికి దాదాపు రూ.25 వేల కోట్లు కేటాయించామ‌ని చెప్పారు. కోతలు లేకుండా సాగుకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. త్వరలో వ్యవసాయ ఆధార, ఆహారశుద్ధి పరిశ్రమలు తీసుకువస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

కేంద్రంలో ప్రధాని మోడీ గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యికి పెంచితే.. ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్యాస్ ​ను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ తక్కువ ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు. కేంద్రం పెంచుతున్న నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌తో రాష్ట్రంలోని ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని మండిప‌డ్డారు. సామాన్య ప్ర‌జ‌ల క‌ష్టాన్ని కేంద్రం సొమ్ము చేసుకుంటోంద‌ని ఆరోపించారు కేటీఆర్.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

అమిత్ షా కోసం ‘పృథ్విరాజ్’ స్పెషల్ ప్రివ్యూ

ఫైనల్ కు గుజరాత్.. క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

కోనసీమ కొట్లాట… ప్రభుత్వ వైఫల్యమన్న పవన్!

కోనసీమ.. రణసీమ.. రేపు మరో నిరసనకు పిలుపు

రాజ్యసభ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ప్రలోభాలతో అధికారం..టీఆర్ఎస్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

భగ్గుమంటున్న సూర్యుడు..గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

మంత్రి ఇంటికి నిప్పు..అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

త్వరలో పార్థసారథి ఫుల్ ఎపిసోడ్..వివరాలు సేకరిస్తున్నా: జగ్గారెడ్డి

కాక్ పిట్‌లో ఆ పని చేసిన పైలట్..ఉద్యోగం ఊస్ట్

రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం..తృటిలో తప్పించుకున్న పుతిన్

ఫిల్మ్ నగర్

అమిత్ షా కోసం 'పృథ్విరాజ్' స్పెషల్ ప్రివ్యూ

అమిత్ షా కోసం ‘పృథ్విరాజ్’ స్పెషల్ ప్రివ్యూ

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

అది ఫేక్ న్యూస్ - శివ నిర్వాణ

అది ఫేక్ న్యూస్ – శివ నిర్వాణ

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)