కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే
2024 ఎన్నికల్లో జగన్కు ఉద్వాసన పలికేందుకు 46 లక్షల పేద కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం పేరుతో పేదలను మోసం చేస్తున్నారు. వారి ఇళ్లను వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లేదు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరు మీద పేదలను ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
పథకం పేరుతో 46 లక్షల మంది నుంచి రూ.4,800 కోట్లను రాబట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు జగన్. డ్వాక్రా మహిళల సొమ్మును లాక్కుంటామని, పెన్షన్లను నిలిపివేస్తామని నోటీసులు కూడా ఇస్తున్నారు. దీన్ని టీడీపీ ఖండిస్తోంది.