ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ని ఓపెన్ చేసి రకరకాల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. సినీ స్టార్స్ తో పాటు వారి భార్యలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రత ఇప్పటికే ఆ లిస్టులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా ఆ లిస్ట్ లో చేరారు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయని ప్రణతి… తాజాగా ట్విట్టర్ లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారు. మొదటి పోస్ట్ గా తన భర్త ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు మీ అందరితో కలిసి ట్విటర్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Happy to join Twitter with You all! Posting my First tweet with my lovable husband @tarak9999 #NTR. pic.twitter.com/2vQNuuLVDJ
— Lakshmi Pranathi (@LakshmiNTR_) January 27, 2022
Advertisements