• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
Tolivelugu Latest Telugu Breaking News » Crime » భూమి కోసం అర్థరాత్రి కాల్పులు..ముగ్గురు మృతి

భూమి కోసం అర్థరాత్రి కాల్పులు..ముగ్గురు మృతి

Last Updated: January 12, 2023 at 11:37 am

ఉత్తరప్రదేశ్, బరేలీ జిల్లాలోని  ఓ గ్రామంలో భూ వివాదం ముగ్గురు ప్రాణాలను మింగింది. బుధవారం అర్థరాత్రి రెండు గ్రూపులు తుపాకీలతో ఒకరి పై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేయగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

shot from a handgun with fire and smoke

ఇక పోలీసుల సమాచారం ప్రకారం ఫరీదీపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కట్క రామన్ గ్రామ పంచాయతీ గోవింద్ పూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు సర్దార్ పరమవీర్ సింగ్, మరొకరు దేవేంద్ర సింగ్ గా గుర్తించడం జరిగింది. మూడో మృతుడి గురించి ఇంకా తెలియాల్సి ఉందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులు కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే గ్రామంలో మరోసారి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాయ్ పూర్ హన్స్ గ్రామ పంచాయతీ మాజీ గ్రామాధికారి సురేష్ సింగ్ నేతృత్వంలోని బృందం మొదట కాల్పులు జరిపిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. భూమి స్వాధీనం విషయంలో మాజీ ప్రధాన్ కు ముగ్గురు చనిపోయిన వారితో వివాదం ఉందని ఆయన చెప్పారు.

ప్రతీకారంగా రెండో వర్గం కూడా కాల్పులు జరిపిందని ఆయన తెలిపారు. సురేష్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తగిన బలగాలను రంగంలోకి దించగా, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అర్థరాత్రి ఒక్కసారిగా తుపాకీల మోత మోగడంతో గ్రామస్తులు నిద్రలోనే ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఆ లేఖ నకిలీది… క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం…!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

నూతన సెక్రటేరియట్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం…!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం…!

ఫిల్మ్ నగర్

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap