ఓ మహిళ భరణం కోసం భర్తపై కేసు వేసింది. ఈ కేసు విషయంలో సహనం కోల్పోయిన లాయర్ మహిళపై దాడి చేశాడు. అది కూడా కోర్టు ఆవరణలోనే అందరూ చూస్తుండగానే చితకబాదాడు. ఆమె పారిపోతుంటే వెంటబడి మరీ ఉరికించి ఉరికించి కొట్టాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారతి పటేల్(23) అనే మహిళ.. తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆ భర్త తరపున అడ్వొకేట్ భగవాన్ సింగ్(58) వాదిస్తున్నారు. అయితే పిటిషన్ వాదనలకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన లాయర్ ఆమెను కోర్టు ఆవరణలోనే కొట్టాడు.
అతని నుంచి తప్పించుకు పారిపోదామని ప్రయత్నించినా, ఆ లాయర్ వెంటపడి మరీ ఆమె కొట్టాడు. కేకలు వేస్తూ, తనని వదిలేయమని ప్రాధేయపడుతున్నా ఆ లాయర్ వదిలిపెట్టలేదు. కోర్టు సముదాయంలోనే ఇదంతా జరిగింది. అక్కడే కొందరు ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ ఘటన గురువారం జరిగిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు భగవాన్ సింగ్పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. లాయర్ భగవాన్ సింగ్ పై ఐపీసీ సెక్షన్లు 355, 323, 294,506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ బాఘెల్ తెలిపారు.
Shameful…
Lawyer ran and beat woman in Shahdol court premises, woman's child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj— Subham Anand (@anand_subham1) May 6, 2022