• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » ధరణి కేరాఫ్‌ సీక్రసీ! బడాబాబులకు వరం.. సామాన్యుడికి శాపం..!

ధరణి కేరాఫ్‌ సీక్రసీ! బడాబాబులకు వరం.. సామాన్యుడికి శాపం..!

Last Updated: October 16, 2022 at 7:07 pm

– ధరణిని గట్టిగా వాడేస్తున్న నేతలు
– తక్కువ మొత్తంలో భూముల కొనుగోళ్లు
– వందల ఎకరాలు కొనేస్తున్న బడాబాబులు
– ధరణిలో కనిపించకుండా ట్రిక్కులు
– పట్టించుకోని ప్రభుత్వం..!
– రియల్ దందాలోకి భారీగా బ్లాక్ మనీ
– త్వరలో.. తొలివెలుగు సంచలన కథనాలు

రియల్ రంగంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలు, దందాలు.. ఇలా ఎన్నో సంచలనాత్మక విషయాలను తొలివెలుగు బయటపెట్టింది. కనీసం స్పాట్ దగ్గరకు వెళ్లాలంటేనే అధికారులు భయపడిపోయే చోటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి.. ఆధారాలతో సహా కథనాలు ఇచ్చింది. ఇప్పుడు ధరణి పేరుతో జరుగుతున్న దందాపై ఫోకస్ పెట్టాం. త్వరలో మా క్రైంబ్యూరో ఎక్స్ క్లూజివ్ స్టోరీస్ ను అందించబోతోంది. సామాన్యుల భూ సమస్యలను తొలగించాలనే లక్ష్యంతో ధరణిని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి.

ధరణితో కొత్త సమస్యలే వచ్చి పడ్డాయని లబోదిబోమనే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అయితే.. నాణానికి రెండో వైపు మాదిరిగా.. ధరణితో నాయకులు మాత్రం తెగ లాభపడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధ‌ర‌ణి పోర్ట‌ల్ లో భూముల విష‌యాలు ప్రైవేట్ గా పెట్టుకొనే సౌల‌భ్యం ఉంది. ఇది బ‌డా బాబులకు వరంలా మారింది. వంద‌ల కోట్లు విలువ చేసే భూముల‌ను ల‌క్ష‌ల రూపాయ‌ల‌కే కొని అందులో దాచేస్తున్నారు. ఈ విష‌యాల‌న్నీ తెలిసినా కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమీ ప‌ట్ట‌నట్టే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌కుండా ఉండేందుకు బ్లాక్ మ‌నీని వైట్ మ‌నీ చేసుకునేందుకే భూ విక్ర‌యాలు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాయకులు వంద‌ల కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసేసి రిజిస్ట్రేష‌న్ల స‌మ‌యంలో మాత్రం రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.3 ల‌క్ష‌ల విలువ చేసే భూములు అని లెక్కల్లో చూపుతున్నారు. ధ‌ర‌ణిలో భూముల గోప్య‌త‌ ఆప్షన్ తో ఇష్టానుసారంగా కొనుగోలు చేసేయడం అందులో దాచేయ‌డం జోరుగా సాగుతోంది. వ‌రంగ‌ల్ నేత‌ల బాగోతాన్నే తీసుకుంటే ఓ మంత్రికి 150, ఈస్ట్ 100, వెస్ట్ 100, వ‌ర్థ‌న్న పేట 300, ప‌ర‌కాల 200 ఇవ‌న్నీ ప్ర‌భుత్వం కేటాయించిన నిధులు అనుకుంటే పొరపడినట్టే. అక్కడి నేతల మీద ఉన్న ఎక‌రాల భూములు.

వ‌రంగ‌ల్ రైల్వే కోచ్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం ఎప్పుడైతే చ‌ర్చ ప్రారంభించిందో.. నేత‌లు ఇదే అద‌నుగా భావించి వంద‌ల ఎక‌రాల‌ను వారి పేరు మీద‌, బినామీల పేరు మీద కొనుగోలు చేసేసి ధ‌ర‌ణిలో పెట్టేస్తున్నారు. ఈ భూముల విష‌యంలో బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య పెద్దఎత్తున యుద్ధం జ‌రుగుతోంది. కొనుగోలు చేసిన భూమిని లెక్కల్లో రూ.2 లక్షల నుంచి రూ.3 ల‌క్ష‌లు మాత్ర‌మే చూపిస్తున్నారు. నిజానికి మార్కెట్ విలువ ప్ర‌కారం ఎక‌రాకు రూ.80 ల‌క్ష‌ల విలువ ఉంటుంది. ఇది కేవ‌లం వ‌రంగ‌ల్ లో మాత్ర‌మే కాదు.. దాదాపు తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో సేమ్ సీన్.

ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అత్యంత గిరిజ‌న ధ‌న‌వంతుడిగా పేరుగాంచిన మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ పేరిట కొన్ని వంద‌ల ఎక‌రాల భూమి ఉందని సమాచారం. ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి కొనుగోలు చేయ‌డానికి నాయ‌కులే కావాల‌ని ఆ భూముల‌ను చిక్కుల్లో ప‌డేయ‌డం.. అమాయ‌కులైన ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి కేవ‌లం ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు వాటిని దక్కించుకోవడం జరుగుతోంది. ప్రభుత్వానికి ఇదంతా తెలిసానా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఒక‌ప్పుడు బ్లాక్ మ‌నీని వైట్ చేసుకోవ‌డానికి విదేశాల్లోని కంపెనీల్లో, సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెడితే స‌రిపోయేది. కానీ, నేడు అవేమి అక్క‌ర్లేదు. కేవ‌లం భూముల మీద పెడితే చాలు అన్న‌ట్టుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది.

ధ‌ర‌ణిలో భూముల వివ‌రాలు గోప్యంగా ఉంచి అందిన‌కాడికి దోచుకుంటున్న‌ట్లు తొలివెలుగు ఎప్పుడో బ‌హిర్గతం చేసింది. జిల్లాల వారీగా ఏఏ నేత‌లు ఎంతెంత భూములు త‌మ గుప్పిట్లో ఉంచుకున్నారో.. ఎక్కడ నుంచి వారు కొనుగోలు చేశారో.. దానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెట్ట‌బోతోంది తొలివెలుగు క్రైంబ్యూరో.

Primary Sidebar

తాజా వార్తలు

కొడుకుల గొడవ పై మోహన్‌ బాబు సీరియస్‌!

రెడ్ లైన్ దాటిన టీడీపీ ఎమ్మెల్యేలు.. సస్పెండ్ చేసిన స్పీకర్

తరువాతి ఎన్నికల్లో ఆ రెండు కూడా రావు: రోజా!

నా దగ్గరున్న ఆధారాలు సిట్ కు ఇచ్చేది లేదు!

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

హస్తినలో పోస్టర్ల హల్ చల్!

మరో బాంబు పేల్చిన హిండెన్ బెర్గ్ .. జాక్ డోర్సే టార్గెట్ !

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

నిందితుని కోసం ఆపరేషన్..ఇంతలో!

టెన్త్ హాల్ టికెట్స్ వైబ్ సైట్లో..ఆర్టీసీ గుడ్ న్యూస్!

రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత!

చింతకాయల కోసం తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న!

ఫిల్మ్ నగర్

mohan babu anger on manchu vishnu and manoj issue

కొడుకుల గొడవ పై మోహన్‌ బాబు సీరియస్‌!

manchu manoj slams brothe vishnu behaviour

మరోసారి తెరమీదకు  మంచు బ్రదర్స్‌ గొడవ!

chiranjeevi next movie with director sandeep reddy vanga

మెగాస్టార్‌ తో అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ !

chandrabose grand entry in india oscar award

ఆస్కార్‌ ”చంద్రు”డికి ఘన స్వాగతం!

'పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు...!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు…!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …  సెల్ఫ్ మేడ్  స్టార్స్ చిట్ చాట్..!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ … సెల్ఫ్ మేడ్ స్టార్స్ చిట్ చాట్..!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్...!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap