పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ
రాహుల్ గాంధీ సభ విజయవంతమైన స్ఫూర్తితో ప్రజల్లోకి పోతాం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదు. టీఆర్ఎస్, బీజేపీ లకు అధికార బలం ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి జన బలం ఉంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ఊరూరా తీసుకెళ్తాం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో బండి సంజయ్ ఎక్కడున్నాడు.
తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని విమర్శించడం సంజయ్ కి తగదు. కాకినాడలో చేసిన ఒక్క పార్టీ రెండు రాష్ట్రాల తీర్మానం ఎందుకు అమలు చేయలేదో చెప్పి సంజయ్ పాదయాత్ర చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికీ పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ గొడవల వల్లే మిల్లర్లపై వేధింపులు జరుగుతున్నాయి.
నిజంగా అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ పంట సమయంలోనే ఎందుకు చేస్తున్నారు. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్కు మూత పడితే పట్టించుకోవడం లేదు. కానీ కేటీఆర్ వరంగల్ టెక్స్ టైల్ పార్కు పేరిట హడావుడి చేస్తున్నారు. కేవలం మత పరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలవాలని బీజేపీ చూస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ చేసిన జాప్యం వల్ల ఓడిపోయామే తప్ప.. మీ గొప్పతనమేం లేదు. రెండు ఆంబోతులు కొట్లాడుకుంటుంటే ప్రజలు కూడా ఓ నిర్ణయం తీసుకున్నారు. మా పార్టీలో ఉన్న గోడ మీద పిల్లులకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. విబేధాలు, అభిప్రాయ బేధాలుంటే ఇంటర్నల్ వేదికలపై మాట్లాడుకుంటాం. కలిసి కట్టుగా పని చేసి రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం.