అమ్మ సహనం ముందు హిమాలయాలు కూడా చిన్నగా కనిపిస్తాయి. సహనానికి మారుపేరు అమ్మ. ఎంతో ఓర్పు, సహనం ఉండబట్టే తను అమ్మ అయ్యింది. పిల్లలు ఎంత విసిగించినప్పటికీ వారిని లాలిస్తుంది, పాలిస్తుంది. అందుకే మాతృదేవోభవ అంటూ మొదటి స్థానం తల్లికే ఇచ్చారు. తల్లి సహనం కేవలం మనుషుల్లోనే కాదు… ప్రతి జీవిలోనూ ఉంటుంది అనడానికి నిదర్శనమే ఈ వీడియో.
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో తల్లి సింహం తన పిల్లలతో కలిసి నీళ్లు తాగుతూ ఉంటుంది. కానీ అంతలో రెండు చిచ్చర పిడుగు పిల్లలు నీళ్లు తాగకుండా తమ అల్లరిని మొదలెట్టేశాయి. తల్లి సింహం నీళ్లు తాగేటప్పుడు ఓ పిల్ల సింహం తన తల్లి తోక పట్టుకుని లాగుతోంది. నేనమన్నా తక్కువ తిన్ననా అంటూ మరో పిల్ల సింహం తల్లి సింహం పైకి ఎక్కి కిందకి దూకుతోంది. అయినప్పటికీ సింహం మాత్రం పిల్లల్ని ఏమి అనకుండా నీళ్లు తాగుతోంది.
దేవుడి తర్వాత తల్లులకే ఎక్కువ ఓర్పు ఉంటుంది అని సుశాంత నంద ఈ వీడియోకు ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. తల్లి అంటే తల్లే అని ఒకరు అంటే, తల్లిగా ఉండటం అంటే అంత ఈజీ కాదు.. ఎన్నో భరించాలి అని మరొకరు కామెంట్ చేశారు.
Only god has more patience than mothers 💕
VC: Extremenature pic.twitter.com/JYp7lCAiOW— Susanta Nanda IFS (@susantananda3) June 14, 2022