మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఓ కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్, కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని విజయవాడ కోర్టు నుండి ప్రతులు అందాయి. దీంతో లోకేష్తో పాటు కొల్లు రవీంద్ర కోర్టుకు హాజరయ్యారు. కోర్టు దగ్గర నేతలు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు తప్పుబట్టారు. కోర్టు దగ్గర టాస్క్ఫోర్స్ పోలీసులకు ఏం పనంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కోర్టు దగ్గరకు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
2020లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
అయితే.. నాడు ఉన్న కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వీటిని ఖాతరు చేయకుండా లోకేశ్, కొల్లు రవీంద్రలు అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు ఏసీబీ కోర్టుకు వచ్చారని వారిద్దరిపై కేసు నమోదు అయ్యింది. అందులో భాగంగానే సోమవారం లోకేశ్, రవీంద్రలు విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.