గుంటూరు: ‘మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడి మీద మీరు కేసు పెడితే.. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి..? వైఎస్ జగన్ గారూ? ఉరి తియ్యాలా?’ అని టీడీపీ యువనేత లోకేష్ సూటి ప్రశ్న సంధించారు.
‘మీకు, మీ నాయకులకు దమ్ముంటే టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. అంతే కానీ చేతగాని దద్దమ్మల్లా కేసులు పెట్టి పారిపోకండి..’ అంటూ ట్విట్టర్ వేదికగా చాలెంజ్ చేశారు.
‘ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేక మా నాయకుల ప్రెస్ మీట్లపై కులమతాల పేరుతో కేసులు పెడతారా? ఇది కాదా తుగ్లక్ చర్య అంటే!!’ జగన్ సర్కార్పై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడిగారి మీద మీరు కేసు పెడితే, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి @ysjagan గారూ? ఉరి తియ్యాలా?#YSJaganFailedCM
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 27, 2019