అధ్వానంగా మారిన రోడ్లపై సాక్షాత్తూ మంత్రి ప్రజలకు క్షమాపణలు కోరిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది.మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రోడ్డు దుస్థితికి క్షమాపణలు చెపుతూ ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు.
బీజెపీ ఎమ్మెల్యే ప్రధుమన్ సింగ్ తోమర్ గతేడాది అక్టోబర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రోడ్లు నిర్మించే వరకు తాను చెప్పులు ధరించనని తెలిపారు.
కాగా ఇటీవల ఆయన నిరసనతో రోడ్ల మరమ్మతులు ప్రారంభమయ్యాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు.
అనంతరం జ్యోతిరాదిత్య పాదాలకు ప్రధుమన్ నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. త్వరలోనే ఆ రోడ్లు అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు.