• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

అతి పురాతన శివాలయం- హైదరాబాద్ సమీపంలో…!

Published on : February 21, 2020 at 10:00 am

దక్షిణ కాశీ గా పేరు గాంచిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రం లోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే జాతర కు భక్తులు భారీగా తరలి రానున్నారు.

తెలుగు రాష్ట్రాల నుండి కాక, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి రానున్నారు. ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయంగా అనేక విశిష్టతలను కలిగి ఉంది. బ్రహ్మ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు కేతకి వనం లో వెలిశాడు. కేతకీ అంటే మొగిలి పువ్వు అని అర్థం. ఇక్కడ వెలసిన ఆ పరమశివునికి కేతకి పుష్పములు తో అర్చించటం వలన కేతకి సంగమేశ్వరుడిగా పేరు గాంచినట్లు స్కంద పురాణం లో ప్రస్తావన ఉందని అంటున్నారు అర్చకులు.

ఆలయంలోని అమృత గుండం లో ఉంటుంది. ఆలయంలోని అమృత గుండం లో స్నానామాచరిస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. ఆ గుండం లో అన్నప్రసాదం, పితృదేవతలకు పిందప్రదానం చేస్తే సరాసరి ఆ పిండం కాశి కి చేరుతుందని, పితృదేవతలకు మోక్షం లభిస్తుందని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. శివరాత్రి సందర్భంగా కేతకీ సంగమేశ్వర ఆలయం లో ఉత్సవాలు 18వ తేదీ నుండి ప్రారంభమై 26 వ తేది వరకు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా 21వ తేదీన అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమము, స్వామి వారికి అభిషేకం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఋత్వికరణ, పల్లకి సేవ, కార్యక్రమలు నిర్వహిస్థారు. 23వ తేదీన శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది.

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం లో మహాశివరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు ఆలయ కార్యనిర్వాహణ అధికారి. భక్తులు స్వామివారి దర్శించుకుని తరించాలని ఆయన కోరారు.

ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం లో నిర్వహించే జాతర ఉత్సవాల్లో భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నారు.

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ..., బిగ్ స్టోరీ, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ప్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్న అనుష్క‌

ప్లాప్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్న అనుష్క‌

గాలి సంప‌త్ ను ద‌గ్గ‌రుండి చ‌క్క‌బెడుతున్న అనిల్ రావిపూడి

గాలి సంప‌త్ ను ద‌గ్గ‌రుండి చ‌క్క‌బెడుతున్న అనిల్ రావిపూడి

రేటు పెంచిన పూజాహెగ్డే

రేటు పెంచిన పూజాహెగ్డే

నడుముతో చంపుతున్న అనసూయ

నడుముతో చంపుతున్న అనసూయ

ఎఫ్3లో మ‌రో మెగా హీరో?

ఎఫ్3లో మ‌రో మెగా హీరో?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం- టీంలు వ‌దిలిచ్చుకున్న ఆట‌గాళ్లు వీరే

ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం- టీంలు వ‌దిలిచ్చుకున్న ఆట‌గాళ్లు వీరే

బిగ్ బ్రేకింగ్- ఏపీ పంచాయితీ ఎన్నిక‌లకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

బిగ్ బ్రేకింగ్- ఏపీ పంచాయితీ ఎన్నిక‌లకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

ఇన్ సైడ‌ర్ తీర్పుపై సుప్రీంకు జ‌గ‌న్ స‌ర్కార్

ఇన్ సైడ‌ర్ తీర్పుపై సుప్రీంకు జ‌గ‌న్ స‌ర్కార్

BREAKING..50 వేల మార్క్ దాటిన సెనెక్స్

BREAKING..50 వేల మార్క్ దాటిన సెనెక్స్

ఆక‌ట్టుకున్న అమెరికా అధ్య‌క్షుడి తొలి ప్ర‌సంగం- దీని వెనుకా తెలంగాణ వ్యక్తే...!

ఆక‌ట్టుకున్న అమెరికా అధ్య‌క్షుడి తొలి ప్ర‌సంగం- దీని వెనుకా తెలంగాణ వ్యక్తే…!

దేశ‌వ్యాప్తంగా 8,06,484 మందికి వ్యాక్సిన్

దేశ‌వ్యాప్తంగా 8,06,484 మందికి వ్యాక్సిన్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)