• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » ముదురుతున్న బోర్డర్ వివాదం.. కర్ణాటకకు మహారాష్ట్ర బస్సులు బంద్

ముదురుతున్న బోర్డర్ వివాదం.. కర్ణాటకకు మహారాష్ట్ర బస్సులు బంద్

Last Updated: December 7, 2022 at 2:42 pm

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. పోలీసుల సూచనతో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా భావిస్తున్న బెళగావికి ఇక మహారాష్ట్ర బస్సులు వెళ్ళబోవని ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. తమ బస్సులపై కర్ణాటకవాసులు దాడులను ఉధృతం చేసే అవకాశం ఉందని, అందువల్ల అక్కడికి వీటిని నడపరాదని పోలీసులు హెచ్చరించడంతో తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సంస్ధ అధికారులు బుధవారం తెలిపారు.

ఒకప్పుడు బెల్గామ్ గా వ్యవహరించిన బెళగావి ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి కారణమైంది. తమ ప్రయాణికుల భద్రత, తమ వాహనాల సెక్యూరిటీని పురస్కరించుకుని ఇకపై బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. నిన్న మహారాష్ట్ర నుంచి వచ్చిన సుమారు 6 ట్రక్కులపై ఈ జిల్లాలో కన్నడ రక్షణ వేదికకు చెందిన ఆందోళనకారులు రాళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. అలాగే జిల్లా సమీపంలోని ఓ చోట మహారాష్ట్ర బస్సులపై రాళ్ళు విసిరారు.

ఇందుకు ప్రతీకారంగా పూణే వద్ద శివసేన కార్యకర్తలు .. కర్ణాటకకు చెందిన నాలుగు బస్సులను ధ్వంసం చేశారు. సరిహద్దు వివాదంపై తాను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కర్ణాటక సీఎం బొమ్మైతో కూడా సంప్రదించానన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య బోర్డర్ వివాదాన్ని పరిష్కరించే యత్నంలో భాగంగా ఇద్దరు మంత్రులను బెళగావికి పంపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను బొమ్మై నిన్న తప్పు పడుతూ.. దీన్ని తాము ఎదుర్కొంటామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు. 1956 లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. కర్ణాటక పరిధిలోని సుమారు 700 గ్రామాల్లో మరాఠీ భాష మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అందువల్ల వాటిని తమ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే ఇందుకు కర్ణాటక సర్కార్ నిరాకరించడంతో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.

Primary Sidebar

తాజా వార్తలు

ఫార్ములా ఈ రేస్ ఎఫెక్ట్.. నరకయాతన పడుతోన్న నగర వాసులు

ప్రొఫెసర్ కాసీం అరెస్టు…!

బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్…!

దమ్ముంటే రాజీనామా చెయ్.. పువ్వాడ సవాల్!

షర్మిల నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రాకి వెళ్లిపో!

300 కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్!

నా పిల్ అడ్డుకుంటున్నారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కార్…!

ఆ ఛీతాలు మా పార్టీకి చేటు.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోడు

అరుదైన రికార్డులకు దగ్గర్లో అశ్విన్!

ఒకే రోజు మూడు పరీక్షలు… ఆందోళనలో అభ్యర్థులు…!

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు!

ఫిల్మ్ నగర్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

చీటింగ్ కేసులో హీరో నవీన్ రెడ్డి అరెస్ట్

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

అమిగోస్‌ రన్‌ టైం ఎంతంటే!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

సలార్‌ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

శరవేగంగా టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

సార్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

బాహుబలిలో అవంతిక రవిక ముడి..రహస్యం.. !?

ఆమెకు  ఆ  సినిమాల్లో రాని గుర్తింపు  అఖండతో  వచ్చిందిగా..!

ఆమెకు ఆ సినిమాల్లో రాని గుర్తింపు అఖండతో వచ్చిందిగా..!

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న తరలింపు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap