• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఆ అంశాలు ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి..!

ఆ అంశాలు ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి..!

Last Updated: July 20, 2022 at 7:22 pm

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ. రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.

శివసేన చీఫ్‌ ఉద్దవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్లపై అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ఏక్ నాథ్ షిండే వర్గానికి కొంత గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు1 కి సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

పార్టీల పిరాయింపులు, సభ్యుల అనర్హత, పార్టీల విలీనం వంటి అంశాలపై ఈ వ్యాజ్యాలు రాజ్యాంగ పరంగా అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది.

వీటిపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అన్ని పార్టీలు తమ సమస్యలపై వచ్చే బుధవారం (జులై 27) నాటికి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

పార్టీ నియమించిన విప్ స్థానంలో మరొకరిని విప్ గా అసెంబ్లీ స్పీకర్ గుర్తించడాన్ని ఠాక్రే తరఫున న్యాయవాది కపిల్ సిబల్ తప్పుపట్టారు. ఇది పదవ షెడ్యూల్ కు వ్యతిరేకమని ఆయన వాదించారు.

ఓ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి సదరు పార్టీకి దూరమైన వ్యక్తితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సరికాదని సిబల్ అన్నారు. సిబల్ వాదనను షిండే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే తోసిపుచ్చారు.

‘ఓ నాయకుడు తాను ఉంటున్న పార్టీలో మెజారిటీ సంపాదించి, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా, ఆ పార్టీ నాయకుడినే ప్రశ్నిస్తే అది ఫిరాయింపు కిందకు రాదని వివరించారు. పార్టీలోని నేతలంతా కలిసి తమ నాయకుడిని ఎంచుకోవడంలో తప్పేముంది? అని ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలో సీజేఐ జోక్యం చేసుకున్నారు. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు అని అన్నారు. ఇందులో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఏర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత కొన్ని సమస్యలపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని తనకు అనిపిస్తున్నట్టు చెప్పారు. దీనిపై అన్ని పక్షాలు వచ్చే బుధవారం లోగా అభిప్రాయాలు సమర్పించాలని ఆదేశించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించాలి!!

పాక్ లో ల్యాండ్ అయిన హైద‌రాబాద్ విమానం!!

పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ప్రాజెక్టుల్లోకి భారీగా వ‌ర‌ద నీరు!!

మోడీపై కేటీఆర్ సెటైర్స్‌..నెటిజన్స్ నుంచి సారుకు కౌంటర్స్

‘మునుగోడు’ ఆలస్యం… బీజేపీకి కలిసొస్తుందా…!

మారని బతుకులు.. కష్టాల పోగులో నేతన్న

తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలు పూర్తి

బ్రేకింగ్.. తూచ్.. ఆ సూట్ కేసులో ఉంది దుస్తులే!

బ్రేకింగ్.. బీజేపీ ఆఫీస్ ముందు కారు కలకలం!

హైకోర్టులో ఆరుగురు నూతన జడ్జిల ప్రమాణం

ఇంట్లోకి వచ్చిన అనుకోని అతిథి…అవాక్కైన కుటుంబం.!

ఫిల్మ్ నగర్

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)