టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు వేడుకలకు ఈ సారి దూరంగా ఉండాలని శుక్రవారం ప్రకటన విడుదల చేసిన మహేష్ ట్విట్టర్ వేదికగా తాజాగా మరో విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారని చెబుతూ.. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్ను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. అలాగే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కీ ఆయన అభినందనలు తెలియజేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్గారు ప్లాస్మా డొనేషన్ ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ ఎవేర్నెస్తో ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అందరినీ అభినందిస్తున్నాను. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడడానికి దోహదపడే ప్లాస్మాను డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను.ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు.