అమెరికాలో ఒక వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. మెగా మిలియన్స్ తొలిసారి నిర్వహించిన 2023 తొలి లాటరీలో10,973 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఈ లక్కు అతనికి ఊరికే కలిసి రాలేదు.ఇందులో 10 వేలకోట్ల మందికి పైగా పాల్గొన్నారు. లాటరీ సంస్థ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కాగా ఫాలో అయ్యాడు.
*మెగా మిలియన్స్ జాక్ పాట్ లో పాల్గొనాలంటే మొదటిగా వెబ్ సైట్ నుంచి టికెట్ కొనుక్కోవాలి. దీని ధరను రూ.162 గా నిర్ణయించారు.
*ఆ తర్వాత రెండు వేర్వేరు విభాగాల నుంచి ఆరు అంకెలను ఎంపిక చేసుకోవాలి.
* మెదటి విభాగంలో ఐదు వేర్వేరు అంకెలను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 1 నుంచి 70 వరకు అంకెలు ఉంటాయి.
* రెండో విభాగంలో ఒక అంకెను ఎంపిక చేసుకోవాలి. ఇందులో 1 నుంచి 25 అంకెలు ఉంటాయి.దీనినే మెగాబాల్ అంటారు.
*ఈ ఆరు అంకెలు ఒకేసారి కలసిన వారిని ఈ మెగా మిలియన్స్ జాక్ పాట్ వర్తిస్తుంది.
*30,25,75,350 మంది పోటీదారుల్లో పాల్గొంటే ఒకే వ్యక్తిని ఈజాక్ పాట్ వర్తిస్తుంది.
*మెగా మిలియన్స్ జాక్ పాట్ పాటు ప్రతి 1,26,07,306 మందిలో ఒకరికి రూ.8.12 కోట్లు బహుమతిగా అందిస్తారు.
* వీరితోపాటు ప్రతి 9,31,001 మందిలో ఒకరికి రూ.8.12 లక్షలు ఇస్తారు.
మెగా మిలియన్స్ జాక్ మిలియన్స్ జాక్ పాట్ లో మైనే స్టేట్ లోని లెబనాన్ కు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్స్ జాక్ పాట్ లో అతడు రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్ లక్కీడేగా భావిస్తారు.
కానీ అదేరోజు అతడికి భారీ జాక్ పాట్ తగిలింది. జనవరి 13న మెగా మిలియన్స్ జాక్ పాట్ తీసిన డ్రాలో విన్నింగ్ టికెట్ సంఖ్యతో అతడి టిక్కెట్లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిన విజేతగదా ప్రకటించింది మెగామిలియన్స్ జాక్ పాట్.
విజేతకు మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు…29 వాయిదాల్లో చెల్లిస్తారు. అలా కాకుండా మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.7వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాలి.
ఆ తర్వాత అతడికి వచ్చిన సొమ్ము సుమారు రూ.5 వేల కోట్లగా మారనుంది. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడో…అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్ కట్టాలి. రాష్ట్రాన్ని బట్టి అది 0-10 శాతం ఉండొచ్చు.
ఈ లెక్కన అతడికి సుమారు రూ. అతడికి సుమారు రూ.3 వేల కోట్లు అందుతాయి.మెగా మిలియన్స్ జాక్ పాట్ ను గెలుచుకున్న వ్యక్తికి ఆ లాటరీ సంస్థ ప్రధాన డైరెక్టర్ పాట్ మెక్ డొనాల్డ్ అభినందనలు తెలిపారు.
మెగా మిలియన్స్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద జాక్ పాట్ అని ఆయన తెలిపారు. 2018లో దక్షిణ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి రూ.12,436 కోట్లు గెలుచుకున్నాడు. కాగా మెగా మిలియన్స్ జాక్ పాట్ సుమారు 40 ఏళ్ళులా లాటరీ విక్రయాలు జరుపుతోంది.