పీవీ సింధూకు మరోసారి షాక్ తగిలింది. క్వార్టర్స్ లో ఆమె ఓడిపోయి ఇంటిదారి పట్టింది. మలేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకు మరోసారి చుక్కెదురైంది. రెండో సీడ్ తై జూయింగ్ చేతిలో సింధూ ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో 13-21, 21-12, 12-21 తేడాతో సింధూ పరాజయం పాలైంది.
అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో తైజు చేలరేగి ఆడింది. దీంతో మరో విజయాన్ని తైజు తన ఖాతాలో వేసుకుంది. కాగా తై జూయింగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన మలేషియా ఓపెన్ క్వార్టర్ఫైనల్స్లోను సింధూపై తై జూ గెలుపొందింది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు 22 మ్యాచ్ల్లో వీరిద్దరూ తలపడగా..5 మ్యాచ్ల్లో సింధూ,17 మ్యాచ్ల్లో తై జూ విజయం సాధించింది.