వ్యసనానికి బానిసయిన ఓ వృద్ధుడు మద్యం దొరక్క ఆత్మహత్య కు పాల్పడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటు చేసుకుంది. మండపేట గాంధీ నగర్ రైతు బజార్ ఎదుగా ఉన్న వీధి లో నివసిస్తున్న షేక్ బాజి ఖాన్ మండపేట రవికాంత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పాత సామిల్లు షెడ్డు కు ఉరి వేసుకొని మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున రోడ్ పై వెళుతున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా బాజి స్వస్థలం రాజమహేంద్రవరం. జీవన ఉపాధి కోసం తోపుడు రిక్షా నడుపుతూ బ్రతుకుతున్నాడు.
ఈ క్రమంలో రైతు బజార్ సమీపంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలు తో సహజీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస గా మారాడు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్ కావడంతో ఈ మూడురోజులు 2గా మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.